వెంకట్రావ్‌పల్లె సమగ్ర అభివృద్ధికి కృషి..

ABN , First Publish Date - 2021-06-24T05:44:09+05:30 IST

వెంకట్రావ్‌పల్లె గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యే క కృషి చేస్తామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు.

వెంకట్రావ్‌పల్లె సమగ్ర అభివృద్ధికి కృషి..
పోచమ్మకు మొక్కులు చెల్లిస్తున్న పుట్ట మధు

- జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 23: వెంకట్రావ్‌పల్లె గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యే క కృషి చేస్తామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. బుధవారం రామగిరి మండలం వెంకట్రావ్‌పల్లెను ఆయన సందర్శించారు. పోచమ్మకు మొక్కులు చెల్లిం చుకున్న అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామ సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్న జడ్పీ చైర్మన్‌ అభివృద్ధి పనుల వివరా లను అధికారులను ఆరా తీశారు. కార్పొరేషన్‌లో విలీన ప్రతిపాదన రద్దుతో పంచా యతీగా కొనసాగుతున్న వెంకట్రావ్‌పల్లె స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో నడుస్తున్నందున ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. పాలక వర్గం ఉన్న గ్రామాలకు దీటుగా శ్మశాన వాటిక, పల్లెప్రకృతి, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి స్వయంగా తాను పర్యవేక్షించినట్టు పుట్ట మధు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే వరకు ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు త్వరలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించేలా చూస్తానని పుట్ట మధు పేర్కొన్నారు. ఆ సభలో గ్రామస్థులతో చర్చించి అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను ప్రజల సమక్షంలో చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, ఎంపీపీ భాస్కర్‌, నాయకులు కాపురబోయిన భాస్కర్‌, బత్తిని శ్రీనివాస్‌, సమ్మయ్య, శ్రీని వాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:44:09+05:30 IST