అద్దంకి అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-10-24T05:59:56+05:30 IST
అద్దంకి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని శాప్నెట్ చైర్మన్, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య చెప్పారు.
శాప్నెట్ చైర్మన్ కృష్ణచైతన్య
అద్దంకి టౌన్, అక్టోబరు 23 : అద్దంకి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని శాప్నెట్ చైర్మన్, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య చెప్పారు. నగర పంచాయతీ పరిధిలోని ముస్లిం షాదీఖా నా వద్ద కల్వర్టు, 20వ వార్డులోని ఈద్గా వద్ద ప్రహారీ గోడ నిర్మాణానికి శనివా రం జరిగిన శంకుస్థాపనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ షాదీఖానా వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.5 లక్షలు, ఈద్గాకు ప్రహరీ కోసం రూ.7లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ ఎల్.ఎస్తేరమ్మ, వైస్చైర్మన్లు దేసు పద్మేష్, కె.అనంతలక్ష్మి, కమిషనర్ ఫజులుల్లా, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, కార్పొరేషన్ల డైరెక్టర్లు భువ నేశ్వరి, బాజి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.