మత్స్య కార్మికుల సంక్షేమానికి కృషి:ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-10-25T05:35:26+05:30 IST
మత్స కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషిచేస్తానని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
కోదాడ, అక్టోబరు 24 : మత్స కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషిచేస్తానని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వాయిలసింగారం మత్స్య సొస్సైటీ నూతన కార్యవర్గంను అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్య కార్మికుల అభివృద్థే లక్ష్యంగా చేప పిల్లలను అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మార్కెట్ చేసుకునేందుకు అవసరమైన వాహన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట నాగార్జున, నాగేశ్వరరావు, జి వెంకన్న, జే సైదులు, పద్మ, వెంకటేశ్వర్లు, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.