గోవా నుంచి 2 వేల మంది విదేశీ టూరిస్టుల తరలింపు
ABN , First Publish Date - 2020-04-01T18:56:09+05:30 IST
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో 2 వేల మంది ...
పనాజీ: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో 2 వేల మంది విదేశీ టూరిస్టులు చిక్కుకుపోయారు. వారిని సంబంధిత దేశాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పర్యాటక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. కాగా ఇప్పటికే చాలా మంది టూరిస్టులు తమ తమ దేశాలకు వెళ్లిపోగా... ప్రస్తుతం ఉన్న వారిలో అత్యధికులు బ్రిటీషర్లే ఉన్నారని ట్రావెల్ అండ్ టూరిజం అసోసియేషన్ ఆఫ్ గోవా (టీటీఏజీ) ప్రెసిడెంట్ సావియో మెస్సియాస్ పేర్కొన్నారు.