సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-12-08T04:49:11+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారా నికి కృషి చేయాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ అన్నారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
దర్శి, డిసెంబరు 7: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారా నికి కృషి చేయాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాల యంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయ కులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ తహ సీల్దార్ కార్యాలయంలో, సచివాలయాల్లో పను లు జాప్యం జరుగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. నెలల తరబడి ఆన్లైన్ సమస్యతో రైతులు ఇ బ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేణుగోపాల్ సంబంధిత అధికారు లతో మాట్లాడి పనులు సత్వరమే జరిగేలా చర్యలు తీసుకుంటామ న్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృ ద్ధి పథకాలు త్వరితగతిన పూర్త య్యేలా నాయకులు కృషి చేయాల న్నారు. సంక్షేమ పథకాలు అర్హులం దరికీ అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్యూటిఫికేష న్ డైరెక్టర్ కె.అంజిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సోము దు ర్గారెడ్డి, వైసీపీ నాయకులు వైవీ సుబ్బయ్య, ఎస్.తిరుపతిరెడ్డి, గోపు యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.