కొవిడ్ రహిత రాష్ట్ర నిర్మాణం కోసం కృషి
ABN , First Publish Date - 2021-08-03T04:59:00+05:30 IST
కొవిడ్ రహిత రాష్ట్ర నిర్మాణం కోసం తాము కృషి చేస్తున్నామని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ కోశాధికారి విఘ్నేష్ అన్నారు. కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన అనంతయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధాన్ని సోమవారం సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో పంపిణీ చేశారు.
ఆదిలాబాద్, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ రహిత రాష్ట్ర నిర్మాణం కోసం తాము కృషి చేస్తున్నామని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ కోశాధికారి విఘ్నేష్ అన్నారు. కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన అనంతయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధాన్ని సోమవారం సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో పంపిణీ చేశారు. పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్రెడ్డి, చందగణేష్, చిందం దేవిదాస్, గురుస్వామి అనిల్, శివప్రసాద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.