మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి

ABN , First Publish Date - 2021-06-20T06:24:55+05:30 IST

మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల కష్టాలను పరిష్కరించేందుకు మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి
సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రారెడ్డి

జిల్లా వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌


బంగారుపాళ్యం, జూన్‌ 19: మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల కష్టాలను పరిష్కరించేందుకు మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  శనివారం బంగారుపాళ్యం మండలం పాలేరు గ్రామంలో మామిడి రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సలహా సంఘం చైర్మన్‌ మాట్లాడుతూ ఏటా మామిడికి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మామిడి పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మామిడి రైతుల సమస్యలను రాజకీయ కోణంలో చూడటం బావ్యం కాదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుజ్జుపరిశ్రమ యజమనులతో కలసి ధరలను నియంత్రిస్తున్నారని ఆరోపించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు శిరీష్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, దొరస్వామి, ప్రభుచౌదరి, సుబ్రహ్మణ్యం, రవీంద్రనాథ్‌, శివయ్య, తోటాశ్రీహరి, అరుణమలరెడ్డి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:24:55+05:30 IST