క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-17T06:49:47+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు మండల కేంద్రంలో పదెకరాల స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషిచేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రీమియర్‌ లీగ్‌ ఆధ్వర్యంలో మండ

క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
క్రికెట్‌ పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

సంస్థాన్‌ నారాయణపురం, జనవరి 16: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు మండల కేంద్రంలో  పదెకరాల స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషిచేస్తానని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రీమియర్‌ లీగ్‌ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్వహించిన మండలస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు ఆదివారం రాత్రి బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు ఉప్పల నాగరాజు, ఉప్పల లింగస్వామి, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్‌, నాయకులు మందుగుల బాలకృష్ణ, రాపర్తి సురేష్‌, కొండ శ్రీకాంత్‌, శివరాత్రి విద్యాసాగర్‌, శ్రీనివాస్‌నాయక్‌, కరంటోతు భిక్షపతినాయక్‌, రాచకొండ రమేష్‌, అక్బర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T06:49:47+05:30 IST