డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి
ABN , First Publish Date - 2021-03-02T04:47:09+05:30 IST
త్వరలో జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ను న్యాక్బృందం సందర్శించనున్న దృష్ట్యా కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. అనంతరం కళాశాలలో వసతులను పరిశీలించారు.
ఆదిలాబాద్అర్బన్, మార్చి1: త్వరలో జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ను న్యాక్బృందం సందర్శించనున్న దృష్ట్యా కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. అనంతరం కళాశాలలో వసతులను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను హాజరు శాతాన్ని ఆయన ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సమస్యలను ప్రిన్సిపాల్ ప్రతాప్సింగ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కళాశాల ప్రిన్సిపాల్ పదీప్సింగ్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.