విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2021-04-14T05:09:03+05:30 IST
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎ్సయూటీఎఫ్ కృషిచేస్తుందని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి.రాములయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇబ్రహీంపట్నంలోని ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జెండా ఎగరవేశారు. 30శాతం పీఆర్సీ ఫిట్మెంట్ జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునంద, దామోదర్, కిషన్చౌహాన్, అజ్మత్ఖాన్, వెంకటేష్, మల్లేష్ పాల్గొన్నారు.