రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...8మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-27T17:00:22+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని టాంక్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు....

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...8మంది దుర్మరణం

టాంక్ (రాజస్థాన్) : రాజస్థాన్ రాష్ట్రంలోని టాంక్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 14 మంది సభ్యులతో కూడిన ఓ కుటుంబం ఖాటుష్యం దేవాలయాన్ని దర్శించుకొని కారులో తిరిగివస్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రాలీ కారును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జైపూరు ఆసుపత్రికి తరలించామని డీఎస్పీ చంద్రసింగ్ రావత్ చెప్పారు. రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-27T17:00:22+05:30 IST