కరోనా కాటుకు వైద్యులు బలి..!
ABN , First Publish Date - 2020-04-10T09:53:27+05:30 IST
కరోనాపై పోరాటంలో పెద్దసంఖ్యలో ఇటాలియన్ వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ
రోమ్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కరోనాపై పోరాటంలో పెద్దసంఖ్యలో ఇటాలియన్ వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ తమ దేశంలోకి ప్రవేశించిన ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ వందమంది డాక్టర్లు మరణించారని ఇటలీ ఆరోగ్య సంఘం ఎఫ్ఎన్ఓఎంసీఈఓ గురువారం ప్రకటించింది.
యూకేలో 8మంది విదేశీ వైద్యులు మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి యూకేలో ఎనిమిది మంది వైద్యులు బలయ్యారు. వీరంతా విదేశాల నుంచి వలస వచ్చినవారే. వీరిలో భారత్కు చెందిన గుండె వైద్య నిపుణుడు జితేంద్ర రాథోడ్(62)తో పాటు పాకిస్థాన్, సూడాన్ దేశాల నుంచి ఇద్దరేసి, నైజీరియా, శ్రీలంక, ఈజిప్ట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. వీరంతా ఆయా దేశాల నుంచి ప్రాక్టీస్ కోసం యూకే వచ్చారని తెలిపింది.