బాలికపై బాలుడి అత్యాచారం

ABN , First Publish Date - 2021-05-11T14:57:19+05:30 IST

ఎనిమిదేళ్ల బాలికపై 17ఏళ్ల మైనర్‌..

బాలికపై బాలుడి అత్యాచారం

జి.కొండూరు : ఎనిమిదేళ్ల బాలికపై 17ఏళ్ల మైనర్‌ అత్యాచారం చేశాడు. మండల కేంద్రంలోని జి.కొండూరు గ్రామంలో ఉంటున్న ఓ బాలికను అదే ప్రాంతంలో ఉండే 17ఏళ్ల మైనర్‌ సోమవారం మాయమాటలతో సమీపంలోని మునగతోటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలికను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపి సంఘటన స్థలాన్ని మైలవరం సీఐ పి.శ్రీను, ఎస్సై ఆర్‌.ధర్మరాజులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-05-11T14:57:19+05:30 IST