ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-11-12T12:23:43+05:30 IST
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం అందరికీ కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. కోవిడ్ టెస్టులో ఎనిమిది మంది విద్యార్థులతో
రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం అందరికీ కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. కోవిడ్ టెస్టులో ఎనిమిది మంది విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్గా తెలింది. దీంతో తోటి విద్యార్థులు, రెసిడెన్షియల్ యాజమాన్యం ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ రావడంతో మిగిలినవారికి పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను వెంటనే క్వారంటైన్కు తరలించారు.