బిల్డింగ్పై నుంచి దూకి, కరోనా అనుమానితుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-09T16:15:17+05:30 IST
కరోనా వైరస్పై నెలకొన్న భయం ఆ వృద్ధుని ప్రాణాలను హరించింది. రాజస్థాన్లోని జైపూర్నకు చెందిన కైలాశ్(78) కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఇది జరిగిన 13 గంటల తర్వాత ఆసుపత్రి పైకప్పు నుంచి దూకాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని...
జైపూర్: కరోనా వైరస్పై నెలకొన్న భయం ఆ వృద్ధుని ప్రాణాలను హరించింది. రాజస్థాన్లోని జైపూర్నకు చెందిన కైలాశ్(78) కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఇది జరిగిన 13 గంటల తర్వాత ఆసుపత్రి పైకప్పు నుంచి దూకాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని వెంటనే ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కైలాశ్ మృతి చెందాడు. కాగా ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవడంతో కైలాశ్ కలత చెందారని, రాత్రంతా నిద్రపోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా కైలాశ్ మృతి చెందిన అనంతరం అతని కరోనా రిపోర్టు వచ్చింది. దానిలో అతను కరోనా నెగిటివ్ అని తేలింది. దీనిని చూసిన బంధువులంతా కైలాశ్ తొందరపడ్డారని అంటున్నారు. అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి మృతి చెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఆస్తమా వ్యాధితో బాధపడున్న కైలాశ్ను అతని కుటుంబీకులు మూడు ఆసుపత్రులకు తీసుకు వెళ్లారు. అయితే కరోనా అనుమానంతో కైలాశ్ను ఆయా ఆసుపత్రులలో చేర్చుకోలేదు. చివరికి ఒక ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అయితే కరోనా రిపోర్టు రాకముందే కైలాశ్ కరోనా భయంతో ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.