విద్యుత్‌ చార్జీలపై అభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2021-01-19T06:53:39+05:30 IST

విద్యుత్‌ చార్జీలపై సోమవారం నుంచి మూడు రోజులు ఏపీఈపీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు డి.శ్రీధర్‌ వర్మ తెలిపారు.

విద్యుత్‌ చార్జీలపై అభిప్రాయ సేకరణ

రామచంద్రపురం, జనవరి 18: విద్యుత్‌ చార్జీలపై  సోమవారం నుంచి మూడు రోజులు ఏపీఈపీడీసీఎల్‌  డివిజన్‌  కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ  చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు డి.శ్రీధర్‌ వర్మ తెలిపారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ సి.వి.నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రతిరోజు వినియో గదారుల నుంచి సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.  వినియోగదారులు కొవ్వూరి త్రినాధరెడ్డి, మేడపాటి సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు డి.శ్రీధర్‌వర్మ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎ.వి.రామారావు, ఏఏవో వాసిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T06:53:39+05:30 IST