కొత్తూర్ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి
ABN , First Publish Date - 2021-04-14T03:59:52+05:30 IST
కొత్తూర్ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి
- కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు
- నేడో, రేపో నోటిఫికేషన్
కొత్తూర్: మున్సిపాలిటీ(కొత్తూర్) ఎన్నికల సందడి మొదలైంది. కాంగ్రె్సలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనతో పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మండల కేంద్రమైన కొత్తూర్తో పాటు పరిసర గ్రామ పంచాయతీగా ఉన్న తిమ్మాపూర్ను కొత్తూర్లో కలిపి నూతన మున్సిపాలిటీగా ఏర్పాటుచేశారు. త్వరలో జరుగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే కొత్తూర్ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జోరుగా కొనసాగుతుండడంతో టీఆర్ఎ్సలోకి చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే తిమ్మాపూర్ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకింది రాజేందర్గౌడ్, మాజీ సర్పంచ్ డోలీ రవీందర్లు వందలాది మంది అనుచరులతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎ్సలో చేరారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ వార్డుసభ్యుడు పీర్లగూడెం మహే్షగౌడ్, అనుచరులు మంత్రి శ్రీనివా్సగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎ్సలో చేరారు. కాగా కొత్తూర్ మున్సిపాలిటీని 12వార్డులుగా విభజించగా టీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎ్సలో చేరేందుకు క్యూ కడుతుండడంతో ఎవరికి టిక్కెట్ దక్కుతుందనే సందేహంలో టీఆర్ఎస్ నాయకులున్నారు.
- నేడు కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు ..!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేడు కొత్తూర్కు వస్తున్నారు. కొత్తూర్కు చెందిన మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తిమ్మాపూర్, కొత్తూర్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో టీఆర్ఎ్సలో చేరబోతున్నారు.