స్ట్రాంగ్ రూమ్కు ఎన్నికల సామగ్రి
ABN , First Publish Date - 2021-01-21T05:53:35+05:30 IST
ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల సామగ్రిని నగర పాలక సంస్థ నుంచి స్ట్రాంగ్ రూమ్కు పోలీస్ బందోబస్తు మధ్య బుఽధవారం తరలించారు.
కర్నూలు(అర్బన్), జనవరి 20: ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల సామగ్రిని నగర పాలక సంస్థ నుంచి స్ట్రాంగ్ రూమ్కు పోలీస్ బందోబస్తు మధ్య బుఽధవారం తరలించారు. రాజకీయ ప్రతినిధులు, అభ్యర్థుల ఎదుటే ఈ ప్రక్రియను కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సామగ్రి తరలిస్తున్న వాహనాలు ఎక్కడా ఆగకుండా నేరుగా కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్కు చేరుకునేందుకు ట్రాఫిక్ డీఎస్పీ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.