మళ్లీ సమరమే

ABN , First Publish Date - 2021-10-24T05:24:37+05:30 IST

ఉప ఎన్నికల వేడి రాజు కుంది.

మళ్లీ సమరమే

ఆచంట నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి

పెనుగొండ జడ్పీటీసీ, పెదమల్లం సర్పంచ్‌ స్థానాలకు పోటీ

నేడో రేపో మోగనున్న ఎన్నికల నగారా?


ఆచంట, అక్టోబరు 23 : ఉప ఎన్నికల వేడి రాజు కుంది. నేడో రేపో నోటిఫి కేషన్‌ వెలువడుతుందని సమాచారం అందడంతో నాయకుల్లోనూ టెన్షన్‌ నెల కొంది. ఆచంట నియోజకవర్గంలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలో పెనుగొండ జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన చలుమూరి తులసీ అన్నపూర్ణ మృతి తో ఎన్ని కను వాయిదా వేశారు. ఆచంట మండలం పెదమల్లం సర్పంచ్‌ దిరిశాల వెంకట వర ప్రసాద్‌ అకాల మరణంతో ఇక్కడ కూడా ఎన్నిక అనివార్యమైంది. దీంతో నియోజకవర్గంలో మరలా పెనుగొండ, పెదమల్లంలో ఎన్నికల నగరా మోగనుంది. పరిషత్‌ ఎన్నికల్లో నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో టీడీపీ, జనసేన పొత్తు కారణంగా జడ్పీటీసీ, ఎం పీపీ స్థానా లను టీడీపీ దక్కించుకుంది. ఇప్పటికే మంచి జోష్‌ మీద ఉన్న టీడీపీ నాయకులు ఏదో విధంగా పెనుగొండ జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవాలనే వ్యూహంలో ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో పెనుగొండ సర్పం చ్‌ స్థానం కూడా టీడీపీనే కైవశం చేసుకుంది.దీనిలో భాగంగా పెనుగొండలో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుని ఇక్కడ విజయం సాధించాలనే ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ  ఆచంటలో  ఓటమి చెందడంతో ఏదో విధంగా భారీ మెజార్టీతో పెనుగొండ జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు అపుడే పెనుగొండ పై దృష్టి పెట్టారు. అలాగే పెదమల్లం సర్పంచ్‌ స్థానాన్ని జనసేన, టీడీపీ పొత్తుతో గెలుపొందాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన  ఎంపీటీసీ ఎన్నికల్లో పెదమల్లం నుంచి ఎంపీటీసీ అభ్యర్థి జనసేన నుంచి విజయం సాధించారు. ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ రానున్న తరుణంలో అపుడే ఈ గ్రామాల్లో ఎన్నికల సందడి  నెలకొంది. ఏదేమైనప్పటికి ఆచంట నియోజకవర్గ నాయకులకు, ప్రజలకు మరలా ఎన్నికల సందడి రానుంది. 


Updated Date - 2021-10-24T05:24:37+05:30 IST