నేడు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

ABN , First Publish Date - 2020-08-03T10:35:03+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సోమవారం జరగనుంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోఉదయం 11గంటలకు

నేడు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

కాగజ్‌నగర్‌లో నాలుగు స్థానాలకు ఆరుగురు ఆశావహులు

కరోనా నేపథ్యలో టెలీ వాయిస్‌ ద్వారా ఎన్నిక 


కాగజ్‌నగర్‌, ఆగస్టు2: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సోమవారం జరగనుంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోఉదయం 11గంటలకు మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం హాలులో టెలీవాయిస్‌ ద్వారా ఎన్నిక చేపట్టనున్నారు. నాలుగు కోఆప్షన్‌ స్థానాలకు తొమ్మిది దరఖాస్తులు రాగా మార్త సత్యనారాయణ, జానిమియా, కమల్‌కిషోర్‌ బంగ్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు. 


బరిలో ఉన్న వారు

కోఆప్షన్‌ స్థానాల కోసం పట్టణానికి చెందిన దేవయ్య, సుభాన్‌, శశికళ, స్రవంతబాయి, గిరిగుల లక్ష్మి, వసీమున్ని బరిలో ఉన్నారు.  కాగా  దేవయ్య, స్రవంతబాయి, సుభాన్‌, గిరుగుల లక్ష్మికి కో ఆప్షన్‌ పదవులు దక్కే అవకాశాలున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యురాలి ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వసీమున్నీసా దరఖాస్తు చేసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో మైనార్టీ కోటా మహిళలు లేరని, ఎలాంటి తప్పుడు పత్రాలు జారీ చేయరాదని కలెక్టర్‌తో పాటు తహసీల్దార్‌కు సిర్పూర్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్‌బాబు ఫిర్యాదు చేశారు. చిన్నపాటి తప్పిదం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హరీష్‌బాబు తెలిపారు. దీంతో కో ఆప్షన్‌ ఎన్నిక రసవత్తరం కానుంది. 


ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి-శ్రీనివాస్‌, కమిషనర్‌, కాగజ్‌నగర్‌ 

మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. కరోనా నేపథ్యంలో టెలీవాయిస్‌ విధానం ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం.

Updated Date - 2020-08-03T10:35:03+05:30 IST