హుజురాబాద్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల ప్రధానాధికారి
ABN , First Publish Date - 2021-10-24T00:43:07+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, కరోనా నిబంధనలు పాటిస్తామన్నారు. ఉప ఎన్నికల కోసం 20 కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు.