జూన్ 19 న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు : ఈసీ
ABN , First Publish Date - 2020-06-01T23:43:23+05:30 IST
కరోనా కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : కరోనా కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్ణయించింది. 18 రాజ్యసభ సీట్లకు మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండేవి. అయితే కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. లాక్డౌన్ సడలించడంతో జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయ్యింది.
అయితే ఎన్నికలు నిర్వహించే సమయంలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల సంఘం సూచించింది. ఏపీలో నాలుగు స్థానాలకు, గుజరాత్లో నాలుగు స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మధ్యప్రదేశ్లో 3 స్థానాలకు, రాజస్థాన్లో మూడు స్థానాలకు, మణిపూర్లో ఒక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.