జాతీయ జెండా రంగులతో ‘చంద్రగిరి కోట’కు విద్యుత్‌ దీపాలంకరణ

ABN , First Publish Date - 2021-10-15T06:35:07+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ దేశంలో వంద కోట్లకు చేరుకున్న సందర్భంగా గురువారం రాత్రి కేంద్ర సాంస్కృతిక శాఖ వంద చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించింది.

జాతీయ జెండా రంగులతో ‘చంద్రగిరి కోట’కు విద్యుత్‌ దీపాలంకరణ

చంద్రగిరి, అక్టోబరు 14: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ దేశంలో వంద కోట్లకు చేరుకున్న సందర్భంగా గురువారం రాత్రి కేంద్ర సాంస్కృతిక శాఖ వంద చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా చంద్రగిరి కోటలోని రాజమహల్‌పై జాతీయ జెండా రంగులతో విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. ఈసందర్భంగా చంద్రగిరి పురావస్తుశాఖ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ సత్యం మాట్లాడుతూ.. కేంద్ర సాంస్కృతికశాఖ ఉత్తర్వులతో రాజమహల్‌పై విద్యుత్‌ కాంతులతో కూడిన జాతీయ జెండాను రూపొందించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు ఈ విద్యుత్‌ దీపాలంకరణ ఉంటుందన్నారు. ఈ అలంకరణ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2021-10-15T06:35:07+05:30 IST