తిరుమలలో ఇకనుంచి.. ఎలక్ట్రిక్ వాహనాలు..
ABN , First Publish Date - 2021-08-29T22:26:26+05:30 IST
తిరుమల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ పాలకమండలి.. తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది. రూ.18లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కారును అధికారులు కొనుగోలు చేశారు. తిరుమలలో విధులు నిర్వర్తించే
తిరుమల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ పాలకమండలి.. తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది. ఒక ఎలక్ట్రిక్ కారును రూ.18లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి మొత్తం 35 కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో విధులు నిర్వర్తించే అధికారులకు వీటిని కేటాయించనున్నట్లు తెలిపారు. దశల వారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటూ ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని పాలకమండలి భావిస్తోంది.