విద్యుత్ వాహనాల తయారీ ప్రస్తావన హర్షణీయం
ABN , First Publish Date - 2020-08-09T08:59:35+05:30 IST
రాష్ట్రంలో కాలుష్య రహిత విద్యుత్ వాహనాల తయారీకి పెద్దపీట వేయడంపై కేబినెట్ సమావేశంలో ప్రస్తావించడం ఆహ్వానించదగిన పరిణామమని ఐఐటీహెచ్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) సంస్థ సీఈవో రోహిత్ వదేరా అన్నారు...
- ఐఐటీహెచ్ ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్
కంది, ఆగస్టు 8: రాష్ట్రంలో కాలుష్య రహిత విద్యుత్ వాహనాల తయారీకి పెద్దపీట వేయడంపై కేబినెట్ సమావేశంలో ప్రస్తావించడం ఆహ్వానించదగిన పరిణామమని ఐఐటీహెచ్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) సంస్థ సీఈవో రోహిత్ వదేరా అన్నారు. శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈవీ కంపెనీలకు ఉత్పాదక మద్దతును ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు.