విద్యుదాఘాతంతో దింపు కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-04-14T06:10:54+05:30 IST
విద్యుదాఘాతంతో దింపు కార్మికుడు మృతి చెందాడు.
పి.గన్నవరం, ఏప్రిల్ 13: విద్యుదాఘాతంతో దింపు కార్మికుడు మృతి చెందాడు. రాజులపాలెం శివారు మర్రిగుంట గ్రామానికి చెందిన మాకే పెద్దిరాజు(50) కుందాలపల్లి పుంతరోడ్డులో కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తున్న సమయంలో ఎండిన ఆకును లాగుతుండగా విద్యుత్ తీగ తగిలింది. క్రింద పడి అతడు అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కుమారుడు ఎం.ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.