ఫిబ్రవరి విద్యుత్ స్లాబ్ను అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-05-21T10:47:05+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడి నడి విరుస్తూ జగన్ సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా
ప్రొద్దుటూరు క్రైం, మే 20 : కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడి నడి విరుస్తూ జగన్ సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, గతంలో ఫిబ్రవరి నెలలో వసూలు చేసిన విద్యుత్ స్లాబ్నే ఇప్పుడు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన పదినెలల కాలంలో రెండు సార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్లాబ్ను తీసుకొచ్చారని, దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడిందన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని, కొత్త స్లాబ్తో పెద్దమొత్తంలో కరెంట్ బిల్లులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ చార్జీలను గతంలోలాగా వసూలు చేయాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు.