విద్యుత్ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2020-06-02T08:49:09+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఈపీడీసీఎల్
సీతమ్మధార, జూన్ 1 : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకుడు వి.ఎస్.ఆర్.గణపతి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని కేంద్రం తనగుప్పిట పెట్టుకునే యోచన కనిపిస్తోందని ఆరోపించారు. ఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో దీన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.