నేడు విద్యుత్ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2020-06-01T08:58:07+05:30 IST
దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కేంద్ర బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించడం, భోజన విరామ సమయంలో ప్రదర్శనలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంఘాలు నిర్ణయించాయి. దీనికి మద్దతు ఇస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఏపీఎ్సఈబీ ఏఈఈ సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటనలో తెలిపింది. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం రైతులకు, గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీలు ఇకపై కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఇవ్వాల్సి ఉంటుందని ఏఈఈ ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంశీ శ్రీనివాస్, లక్ష్మణరావు పేర్కొన్నారు.