ఏనుగు దాడిలో చిత్తూరు జిల్లా వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-13T01:08:22+05:30 IST

బంగారుపాలెం మండలం దొర చెరువు సమీపంలో ఏనుగులు హడలెత్తించాయి. పంట పొలాల్లో బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతంలోకి..

ఏనుగు దాడిలో చిత్తూరు జిల్లా వ్యక్తి మృతి

చిత్తూరు: బంగారుపాలెం మండలం దొర చెరువు సమీపంలో ఏనుగులు హడలెత్తించాయి. పంట పొలాల్లో బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నించిన ట్రాకర్ చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నబ్బ అక్కడికక్కడే చనిపోయాడు. బంగారుపాలెం మండలం బలిజపల్లి‌కి చెందిన చిన్నబ్బ కాంట్రాక్టు ఉద్యోగిగా ఏనుగుల ట్రాకర్‌గా పని చేస్తున్నాడు. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని సమాచారం అందుకున్న ట్రాకర్‌ చిన్నబ్బ సంఘటనా స్థలానికి వెళ్లారు. ఏనుగులను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ సమయంలో ఏనుగులు ఒక్కసారిగా చిన్నబ్బపైకి వెళ్లి దాడి చేశాయి. చిన్నబ్బ మృతితో ఆయన స్వగ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నబ్బ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-13T01:08:22+05:30 IST