పంటపొలాలపై ఏనుగుల దాడి

ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST

మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల సమీప పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగులు దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచాయి.

పంటపొలాలపై ఏనుగుల దాడి
ఏనుగుల దాడిలో ధ్వంసమైన మామిడి చెట్లు

పలమనేరు రూరల్‌,మే17 : మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల సమీప పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగులు దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచాయి. నూనేవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి మామిడి తోటలోకి ప్రవేశించి చెట్లను విరచి పైపులైన్లను తొక్కి తీవ్రంగా నష్టపరిచాయి. చిత్ర అనే రైతుకు చెందిన మామిడి, చెంగప్పకు చెందిన మామిడి, కుమ్మరి సుబ్రమణ్యంకు చెందిన వరి, గారిపంట, సముద్రపల్లెలోని దామోదరనాయుడుకు చెందిన వరి, మామిడి, మురళికి చెందిన మామిడి, నల్లప్పకు చెందిన వరి, రాగిపంట, కృష్ణాపురం బలరాంకు చెందిన  మామిడి తోటలపై 12 ఏనుగుల గుంపు, 3 ఏనుగుల గుంపులు ప్రవేశించి తొక్కినాశనం చేశాయి. ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల బారినుండి రక్షించి, పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు విన్నవిస్తున్నారు.

Updated Date - 2021-05-17T05:30:00+05:30 IST