కవిటి మండలంలో నకిలీ టీచర్లను తొలగించండి

ABN , First Publish Date - 2021-06-24T05:02:51+05:30 IST

కవిటి మండలంలో నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను తొలగించాలని దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) హిర మండలం మండల కమిటీ కన్వీనర్‌ గేదెల సింహాచలం డిమాండ్‌ చేశారు.ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

కవిటి మండలంలో నకిలీ టీచర్లను తొలగించండి
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న సింహాచలం

దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక  ప్రతినిధి ఫిర్యాదు

హిరమండలం, జూన్‌ 23: కవిటి మండలంలో నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను తొలగించాలని దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) హిర మండలం మండల కమిటీ కన్వీనర్‌ గేదెల సింహాచలం డిమాండ్‌ చేశారు.ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ సత్యనారాయణకు  ఫిర్యాదు చేశారు. కవిటి మండలంతో పాటు జిల్లాలో ఇతర శాఖల్లోనూ నకిలీ ధ్రువపత్రాలతో పనిచేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటన విజయనగరం జిల్లా విద్యాశాఖలో  చోటు చేసుకోగా అక్కడి అధికా రులు దర్యాప్తు చేసి నకిలీ ధ్రువపత్రాలతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని తొలగించారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ జిల్లాలో కూడా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై తహసీల్దార్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

   

Updated Date - 2021-06-24T05:02:51+05:30 IST