ఎల్లన్ననగర్ పోడు వివాదం..వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-08T02:51:34+05:30 IST

ఎల్లన్ననగర్ పోడు వివాదం కేసులో మహిళలపై నమోదు చేసిన హత్యాయత్నం కేసు విషయంలో

ఎల్లన్ననగర్ పోడు వివాదం..వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ఖమ్మం: ఎల్లన్ననగర్ పోడు వివాదం కేసులో మహిళలపై నమోదు చేసిన హత్యాయత్నం కేసు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మహిళలపై నమోదుచేసిన 307,148 సెక్షన్లను  పోలీసులు తొలగించారు. ఎల్లన్న నగర్ పోడు వివాదానికి సంబంధించి తాము అటవీ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై 307, 148 , 353, 149 సెక్షన్ లతో కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


కానీ తమ విచారణలో పోడు రైతులు ఎటువంటి మారణాయిధాలు ఉపయోగించలేదని, దాడులకు పాల్పడలేదని నిర్దారణ అయిందన్నారు. దీంతో మహిళా రైతులపై నమోదు చేసిన 307, 148 సెక్షన్ లను తొలగిస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని ఖమ్మం జిల్లా జడ్జికి వివరిస్తూ కొణిజర్ల ఎస్సై సురేష్ పిటీషన్ దాఖలు చేసారు. అటవీ శాఖ అధికారుల విధులను అడ్డుకున్నందుకు 143, 353, 149 సెక్షన్‌లోనే కేసు నమోదు చేస్తున్నట్లు జిల్లా జడ్జికి పోలీసులు వివరించారు.  

Updated Date - 2021-08-08T02:51:34+05:30 IST