పెళ్లిచేసుకునేందుకు ఇంటి నుంచి డబ్బు తీసుకొని పారిపోయిన యువతి.. ప్రియుడి వద్దకు వెళ్లగానే సీన్ రివర్స్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-20T06:22:49+05:30 IST

ప్రేమించిన యువకుడినే పెళ్లిచేసుకోవాలనుకుంది ఓ యువతి. ఆమెని ఇంటి నుంచి రూ.50,000 తీసుకొని వస్తే పెళ్లి చేసుకుందామని ఆ ప్రేమికుడు చెప్పాడు. ప్రియుడు చెప్పినట్లు ఆమె డబ్బు తీసుకొని అతని వద్దకు వచ్చింది. కానీ ఆ ప్రియుడు ఆమెను దారుణంగా మోసం...

పెళ్లిచేసుకునేందుకు ఇంటి నుంచి డబ్బు తీసుకొని పారిపోయిన యువతి.. ప్రియుడి వద్దకు వెళ్లగానే సీన్ రివర్స్.. అసలేం జరిగిందంటే..

ప్రేమించిన యువకుడినే పెళ్లిచేసుకోవాలనుకుంది ఓ యువతి. ఆమెని ఇంటి నుంచి రూ.50,000 తీసుకొని వస్తే పెళ్లి చేసుకుందామని ఆ ప్రేమికుడు చెప్పాడు. ప్రియుడు చెప్పినట్లు ఆమె డబ్బు తీసుకొని అతని వద్దకు వచ్చింది. కానీ ఆ ప్రియుడు ఆమెను దారుణంగా మోసం చేశాడు. 


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాకి చెందిన మహిమ(20, పేరు మార్చబడినది) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన శుభమ్ అనే యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయిదేళ్లుగా.. వారి ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. వారిద్దిరి పెళ్లికి మహిహ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం మహిమను ఇంటి నుంచి రూ.50,000 తీసుకొని ఒక హోటల్‌కి రావాలని చెప్పాడు.


శుభమ్ మాటలు నమ్మి.. మహిమ అతని ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి డబ్బు తీసుకొని ఎవరికీ చెప్పకుండా పారిపోయి హోటల్ చేరుకుంది. హోటల్‌లోని ఒక గదిలో శుభమ్.. మహిమను తీసుకొని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి.. డబ్బు తీసుకొని పారిపోయాడు. ప్రియుడి చేతిలో మోసపోయిన మహిమ.. తిరిగి ఇంటికి చేరుకొని తన తల్లిదండ్రులతో జరిగిన విషయం చెప్పింది.


మహిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిమను శుభమ్ గురించి వివరాలు అడిగారు. శుభమ్ గత అయిదేళ్లుగా తనను ప్రేమించినట్టు నటించి మోసం చేశాడని. అయిదేళ్ల క్రితం తను మైనర్‌గా ఉన్నప్పుడు తనపై లైంగికంగా దాడి చేశాడని చెప్పింది.


పోలీసులు శుభమ్‌పై చీటింగ్, పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం శుభమ్ పరారీలో ఉన్నాడు.

Updated Date - 2022-01-20T06:22:49+05:30 IST