రిపబ్లిక్‌ డే స్టాల్స్‌.. జేసీల పరిశీలన

ABN , First Publish Date - 2021-01-27T05:42:56+05:30 IST

72వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాళ్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్లు హిమాన్షు శుక్లా, తేజ్‌భరత్‌ పరిశీలిం చారు.

రిపబ్లిక్‌ డే స్టాల్స్‌.. జేసీల పరిశీలన
స్టాల్స్‌ పరిశీలిస్తున్న జేసీ, తదితరులు

ఏలూరు, జనవరి 26 (ఆంధ్రజ్యో తి): 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాళ్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్లు హిమాన్షు శుక్లా, తేజ్‌భరత్‌ పరిశీలిం చారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ, విభిన్న ప్రతిభావం తుల శాఖ, గృహనిర్మాణ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌, డీఈవో రేణుక, హౌసింగ్‌ పీడీ ఎన్‌.రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ గౌసియాబేగం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:42:56+05:30 IST