మహమ్మారి కాలంలో బరువు తగ్గినవారికి బహుమతులు

ABN , First Publish Date - 2021-08-18T18:04:53+05:30 IST

మహమ్మారి కాలంలో వివిధ పద్ధతుల్లో బరువు తగ్గిన వారికి...

మహమ్మారి కాలంలో బరువు తగ్గినవారికి బహుమతులు

అబుధాబి: మహమ్మారి కాలంలో వివిధ పద్ధతుల్లో బరువు తగ్గిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ(దమన్) సీఈవో హమద్ అల్ మెహియాస్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెహియాస్ పేరుతో ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్ ఛాలెంజ్ చేశారు. కొంత వ్యవధిలో ప్రత్యేక పద్దతులను అనుసరించి, బరువు తగ్గినవారు తాము అనుసరించిన విధానాలను ఈ ఛాలెంజ్‌లో షేర్ చేయడం ద్వారా ఐఫోన్, యాపిల్ వాచ్ తదితర బహుమతులను అందుకోవచ్చని తెలిపారు. ఈ మహమ్మారి సమయంలో ఆరోగ్యకరమైన అలవాట్లకు ఆంటకాలేర్పడ్దాయి. ఫలితంగా పలువురు బరువు పెరిగారని హమద్ అల్ మెహియాస్ పేర్కొన్నారు. ఇదిలావుండగా మహమ్మారి సమయంలో యూఏకీ చెందిన 31 శాతం మంది బరువు పెరిగారని ఒక అధ్యయనంలో తేలింది. 39 శాతం మంది శారీర వ్యాయామానికి దూరమై పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడయ్యింది.


Updated Date - 2021-08-18T18:04:53+05:30 IST