ఎమ్మెల్సీ రామచంద్రయ్యను అరెస్ట్ చేయాలి
ABN , First Publish Date - 2021-05-14T09:08:57+05:30 IST
కడప క్వారీ పేలుళ్ల ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను తక్షణం అరెస్ట్ చేయాలని టీడీపీ పొలిట్బ్యూ రో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. సామర్లకోట మండలం
సామర్లకోట, మే 13: కడప క్వారీ పేలుళ్ల ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను తక్షణం అరెస్ట్ చేయాలని టీడీపీ పొలిట్బ్యూ రో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మామిళ్లపల్లిలో జరిగిన క్వారీ పేలుళ్ల ఘటనను ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎలాంటి మైనింగ్ జరిగినా దానిలో వైసీపీ నేతల దోపిడీ తారాస్థాయికి చేరిందన్నారు. కడప జిల్లాలో పేలుళ్లు జరిగిన క్వారీ వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుటుంబ సభ్యుల పేరిట ఉందన్నారు. అసలు లీజుదారులను వదిలివేసి పేలుళ్ల ఘటనకు బాధ్యుడంటూ సబ్ లీజ్దారుణ్ని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.