ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆఫీసు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-06T06:14:41+05:30 IST

ఆర్టీసీ డిపోలో వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు.

ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆఫీసు ప్రారంభం

రామచంద్రపురం, మార్చి 5: ఆర్టీసీ డిపోలో వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు జొన్నాడ జేమ్స్‌, కార్యదర్శి వర్రే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా తొగరు మూర్తి,  అధ్యక్షుడిగా బుద్ధరాజు కృష్ణంరాజు, కార్యదర్శిగా దంగుడు బియ్యం శివరామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా రాయుడు సుబ్రహ్మణ్యం, కోశాధికారిగావర ప్రసాద్‌ ఎన్నికయ్యారు.

Updated Date - 2021-03-06T06:14:41+05:30 IST