కియా పరిశ్రమలో కరోనా కలకలం.. ఉద్యోగికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-04T20:05:04+05:30 IST

అనంతపురం: కియా పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. పరిశ్రమలోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కియా పరిశ్రమలో కరోనా కలకలం.. ఉద్యోగికి పాజిటివ్

అనంతపురం: కియా పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. పరిశ్రమలోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాధితుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కియా పరిశ్రమ నుంచి అనంతపురం ఎస్కేయూ క్వారంటైన్‌కు పాజిటివ్ వ్యక్తిని అధికారులు తరలించారు. ఈ మేరకు కియా పరిశ్రమ ప్రతినిధులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా మంత్రి శంకరనారాయణ ఇటీవల కియా పరిశ్రమ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే విధుల్లోకి తీసుకోవాలని కియా పరిశ్రమ యాజమాన్యం సూచించింది.

Updated Date - 2020-06-04T20:05:04+05:30 IST