ఉద్యోగులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలి

ABN , First Publish Date - 2021-12-08T04:52:08+05:30 IST

మేనిఫెస్టోలో ఉద్యోగులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని మంగళవారం యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఉద్యోగులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలి
నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న వైద్యులు, ఆరోగ్యకేంద్రం సిబ్బంది

రాయచోటి, డిసెంబరు7: మేనిఫెస్టోలో ఉద్యోగులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని మంగళవారం యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోలు రాయచోటి తాలూకా యూనిట్‌ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో 2019లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరచాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య, ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌నాయక్‌ , ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర  కన్వీనర్‌ యర్రపురెడ్డి విశ్వనాఽథరెడ్డి, జేఏసీ జిల్లా నాయకుడు గుగ్గిళ్ల రాజేంద్ర, సీహెచ్‌వో భాగ్యలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు, స్టాఫ్‌నర్సు దేవగణే్‌షరెడ్డి, ఏఎన్‌యంలు నిర్మలమ్మ, సుజాత, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T04:52:08+05:30 IST