యాజమానికి గుమాస్తా టోకరా.. 2.5 కోట్ల వెండి కాజేత
ABN , First Publish Date - 2021-04-21T10:07:55+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అంబికా సిల్వర్ ప్యాలస్ దుకాణంలో 354 కేజీల వెండిని షాపులో పనిచేసే గుమాస్తా తాట్ల శివప్రసాద్ తప్పుడు లెక్కలు చూపించి కాజేసి యజమానిని మోసం చేసినట్టు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చెప్పారు.
నరసాపురం, ఏప్రిల్ 20: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అంబికా సిల్వర్ ప్యాలస్ దుకాణంలో 354 కేజీల వెండిని షాపులో పనిచేసే గుమాస్తా తాట్ల శివప్రసాద్ తప్పుడు లెక్కలు చూపించి కాజేసి యజమానిని మోసం చేసినట్టు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చెప్పారు. మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందన్నారు. హోల్ సేల్ వ్యాపారం కావడంతో నిత్యం పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతుంటుంది. 12 ఏళ్ల నుంచి శివప్రసాద్ పని చేస్తుండటంతో అతనిపై యజమానికి పూర్తి నమ్మకం ఏర్పడింది. దీంతో గుమాస్తా శివప్రసాద్ ఏడాది నుంచి తప్పుడు లెక్కలతో యజమానిని మోసం చేస్తూ వచ్చాడు. అయితే గుమాస్తా తీరుపై అనుమానం వచ్చిన యజమాని అశోక్కుమార్ జైన్ మంగళవారం లెక్కలు చూడటంతో మోసం బయటపడింది.