జీజీహెచ్లో నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
ABN , First Publish Date - 2021-12-09T05:29:05+05:30 IST
ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న ఉద్యోగులు రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
రెండో రోజు కొనసాగిన నిరసన కార్యక్రమాలు
భానుగుడి(కాకినాడ),
డిసెంబరు 8: ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ
సమస్యలపై పోరాటం చేస్తున్న ఉద్యోగులు రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని
కొనసాగించారు. నల్లబ్యాడ్జీలను ధరించి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఈ
సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ గుద్దాటి రామ్మోహన్రావు, ఏపీజేఏసీ
అమరావతి జిల్లా చైర్మన్ పితాని త్రినాథ్ బుధవారం కాకినాడలోని అన్ని
ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. సీపీఎస్ రద్దు,
పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న డీఏల విడుదల, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్
ఉద్యోగుల పర్మినెంట్ డిమాండ్లతో ముందుకెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, సెక్రటరీ
పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చ ంద్రరావు తదితరులు పాల్గొన్నారు.