నేడు ఉద్యోగుల సమావేశం
ABN , First Publish Date - 2022-01-24T04:14:36+05:30 IST
పట్టణంలోని ఎన్జీవో హోంలో ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల స మావేశం నిర్వహిస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు నరేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
గిద్దలూరు, జనవరి 23 : పట్టణంలోని ఎన్జీవో హోంలో ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల స మావేశం నిర్వహిస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు నరేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.