ఉద్యోగులు క్రమశిక్షణతో పని చేయాలి
ABN , First Publish Date - 2020-07-02T10:37:15+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన ఈవోగా ఎల్.రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు
అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఇప్పిస్తా
భద్రాద్రి దేవస్థానం నూతన ఈవో రమాదేవి
రామయ్య దర్శనం అనంతరం బాధ్యతల స్వీకరణ
భద్రాచలం, జూలై 1: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన ఈవోగా ఎల్.రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఈవో కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి ఆలయ నిర్వహణకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయ ఉద్యోగులంతా క్రమశిక్షణతో పని చేయాలని తెలిపారు. అవుట్సోర్సింగ్లో పని చేస్తున్న 150మందికి నాలుగు నెలల జీతాలు పెండింగులో ఉన్న విషయంలో ఉన్న సాంకేతిక అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా వారికి ప్రతి నెల జీతం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.