ఇలా అయితే ఉద్యోగాలు చేయలేం

ABN , First Publish Date - 2020-06-05T10:35:35+05:30 IST

జమ్మలమడుగులోని 17వ వార్డు గ్రామ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం వలంటీర్లకు స్థానిక వైసీపీ చోటా నాయకులకు మధ్య వాగ్వాదం

ఇలా అయితే ఉద్యోగాలు చేయలేం

  • గ్రామ సచివాలయ ఉద్యోగులు

జమ్మలమడుగు రూరల్‌,  జూన్‌ 4: జమ్మలమడుగులోని 17వ వార్డు గ్రామ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం వలంటీర్లకు స్థానిక వైసీపీ చోటా నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వలంటీర్లు ఏదైనా తమకు చెప్పి చేయాలని ఉద్యోగాలు తామే ఇప్పించామని 17వ వైసీపీ నాయకులు అన్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగిని నాగలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల బెదిరింపులతో తాము పనిచేయలేకుండా ఉన్నామని అన్నారు. ఇప్పటికే వారు ఫోన్లు చేసి చెప్పినవారందరికీ నిబంధనల మేరకే నేతన్న నేస్తం మగ్గాలకు సంబంధించి పరిశీలించి ఎంపిక చేశామన్నారు. ఇలా ఉంటే తాము ఉద్యోగాలు చేయలేమని వాపోయారు.


కుండా వెంకటేష్‌, లక్ష్మిదేవి, వెంకటదాసు, కుండాభారతి అనే పేర్ల ఎంపిక విషయంలో అదే వార్డుకు చెందిన వైసీపీ నాయకులు తమను హెచ్చరిస్తున్నారని వలంటీర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫిర్యాదు చేయాలని వలంటీర్లకు సూచించారు. వెంటనే వలంటీర్లు నగర పంచాయతీ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. చివరకు కొందరు వైసీపీ నాయకులు ఫోన్లు చేసి మాట్లాడటంతో సమస్య సద్దుమణిగినట్లు సమాచారం.

Updated Date - 2020-06-05T10:35:35+05:30 IST