నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-01-22T05:26:41+05:30 IST

కొత్త పీఆర్సీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని శుక్రవారం రిమ్స్‌లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
నిరసన తెలుపుతున్న రిమ్స్‌ సిబ్బంది

కడప(సెవెన్‌రోడ్స్‌), జనవరి 21 : కొత్త పీఆర్సీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని శుక్రవారం రిమ్స్‌లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ పీఆర్సీ వల్ల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్‌ మెడికల్‌ కాలేజీ, డెంటల్‌ కాలేజీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. సీనియార్టీ ప్రకారం టైం స్కేల్‌ను నిర్ధారించాలన్నారు. యూనియన్‌ అధ్యక్షుడు వరపుత్ర భాస్కర్‌, సుదర్శన్‌, పాపిరెడ్డి, యేసన్న, చిన్నయ్య, గఫర్‌, శారద, గౌరీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:26:41+05:30 IST