పొంగిన వాగులతో మత్స్యకారులకు ఉపాధి
ABN , First Publish Date - 2021-12-03T07:00:11+05:30 IST
తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు వరద నీటితో భారీగా ప్రవహిస్తున్నాయి.
సీఎ్సపురం, డిసెంబరు 2 : తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు వరద నీటితో భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరికింది. మండలంలోని డొక్కలవాగు, మన్నేరు వరద నీటితో ప్రవహిస్తుండడంతో కొత్తనీరుకు మోపాడు, సీ.ఎ్స.పురం మరికొన్ని చెరువులలో పెంచుతున్న చేపలు ఎదురీదుతూ వాగుల్లోకి వస్తున్నాయి. దీంతో వాగుల దగ్గర మత్స్యకారులు వలలు వేసి చేపలు పట్టుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురువడంతో ఈ విధంగా వారికి ఉపాధి దొరికింది.