ఉపాధి హామీ పనులను సద్వినియోగపర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-04-21T06:22:19+05:30 IST

గ్రామాల్లో మహాత్మాగాంధీ ఉపాధిహామీ పనులను ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు అన్నారు.

ఉపాధి హామీ పనులను సద్వినియోగపర్చుకోవాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పీడీ

డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు

సోన్‌, ఏప్రిల్‌ 20 : గ్రామాల్లో మహాత్మాగాంధీ ఉపాధిహామీ పనులను ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉపాధిహామీపై కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పనులను చేపట్టాలన్నారు. గ్రామాల్లో పనుల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ఉపాధిపనులపై ఎప్పటికప్పుడు నివేదికలు పూర్తి చేసి సమర్పించా లన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అశోక్‌, ఈజీఎస్‌ ఏపీఎం మంజుల, గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T06:22:19+05:30 IST