ఉపాధి పనుల జోష్‌

ABN , First Publish Date - 2020-05-22T11:23:33+05:30 IST

ఉపాధి హామీ పనులు జోష్‌గా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో పనులకు వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వేసవిలో వీలైనంత

ఉపాధి పనుల జోష్‌

21న రికార్డు స్థాయిలో 2,03,369 మంది హాజరు


కడప, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనులు జోష్‌గా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో పనులకు వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వేసవిలో వీలైనంత మందికి వీలైనన్ని పనిదినాలు కల్పించాలని డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా సిబ్బందికి ఆదేశాలివ్వడంతో పనికి వచ్చే వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. గురువారం 2,03,369 మంది కూలీలు హాజరై రికార్డు సృష్టించారు. ఇంత పెద్ద ఎత్తున కూలీలు హాజరు కావడంతో అధికార యంత్రాంగం కూడా ఖుషీగా ఉంది. 

Updated Date - 2020-05-22T11:23:33+05:30 IST