ఉపాధిపనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-01-20T06:48:55+05:30 IST
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పఽథ కం పనులు వేగవం తం చేయాలని, అన్ని గ్రామపంచాయతీల్లో జాబ్కార్డు కలిగిన కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ఆదేశించారు.
కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్
నల్లగొండ టౌన్, జనవరి 19: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పఽథ కం పనులు వేగవం తం చేయాలని, అన్ని గ్రామపంచాయతీల్లో జాబ్కార్డు కలిగిన కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధిహామీ పనులు, వైకుంఠధామాల నిర్మాణ పనులను బుధవారం మండలాల వారీగా సమీక్షించారు. ప్రతీ గ్రామపంచాయతీలో ఒక ఫాంపాండ్ కానీ, ఫిష్పాండ్ కానీ ఉపాఽధిహామీ కింద చేపట్టాల ని ఆదేశించారు. చాలా వరకు మండలాల్లో ఉపాధి హామీ కింద కూలీలలకు పనులు కల్పించడంలో ఆ శించిన మేర ప్రగతి లేదని, నిర్ధేశిత లక్ష్యం మేరకు పనులు కల్పించాలన్నారు. మిగిలి ఉన్న వైకుంఠధామాల పనులు జనవరిలోగా పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామీ పనులను పరిశీలించేందుకు నేషనల్ మానిటరింగ్ టీమ్ జిల్లాలో పర్యటించనున్నందున, సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు అప్డేట్చేసి సిద్ధం గా ఉంచాలన్నారు. కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ అపూర్వ చౌహాన్, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డీఆర్డీవో కాళిందిని, పీఆర్ ఈఈ తిరుపతయ్య పాల్గొన్నారు.